తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ముంబై పోర్ట్ జోన్ డీసీపీ సుధాకర్ మృతి

  • నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రబాద్ మండలంలో ప్రమాదం
  • అధికారి ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించిన పోలీసులు
నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముంబై పోలీసు పోర్ట్ జోన్ డీసీపీ సుధాకర్ పఠానేతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారిలో ఒకరిని మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారిగా గుర్తించారు. మరో వ్యక్తిని భగవత్‌గా గుర్తించారు.

Mumbai Police
Road Accident
Telangana
DCP
Maharashtra Police

More Telugu News